ఏపీ మాజీస్పీకర్ కోడెల శివప్రసాదరావు అంతిమయాత్రలో స్వల్ప ఉద్రిక్త పరిస్ధితులు చోటు చేసుకున్నాయి. అంతిమయాత్ర వెళ్లే రూట్ మ్యాప్ మార్చారంటూ టీడీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. అధికారపార్టీ ఒత్తిడి వల్లే పోలీసులు అంతిమయాత్ర రూట్ మ్యాప్ మార్చారంటూ టీడీపీ కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసు ఉన్నతాధికారులు కార్యకర్తలకు నచ్చజెప్పడంతో పరిస్ధితి అదుపులోకి వచ్చింది.
షెడ్యూల్ ప్రకారం అంతిమయాత్ర సాగేదారిలో నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఇంటిని దాటాల్సి వుంటుంది. ఇప్పటికే ప్రభుత్వంపై కోడెల కుటుంబసభ్యులతో పాటు తెలుగుదేశం నేతలు మండిపడుతుండటంతో ఎలాంటి హింసాత్మక ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు రూట్ మార్చారని తెలుస్తోంది. మరికొద్దిసేపట్లో నరసరావుపేటలోని స్వర్గపురిలో కోడెల అంత్యక్రియలు జరుగనున్నాయి.
ఏపీ మ్యాప్ లో అమరావతి లేకపోవడానికి వైసీపీనే కారణం: యనమల