మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు పై ప్రభుత్వం కేసులు పెట్టి వేధించడం వల్లే ఆత్మహత్య చేసుకున్నారంటూ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారని శాసనమండలి చీఫ్విప్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ఆరోపించారు. విశాఖలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కోడెలపై రాష్ట్ర ప్రభుత్వంగానీ, వైసీపీ నేతలుగానీ ఒక్క కేసు కూడా పెట్టలేదన్నారు.
టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు చేసిన అవమానాల కారణంగానే మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య చేసుకున్నారని సమీక్షల పేరుతో జిల్లాల్లో పర్యటిస్తున్న చంద్రబాబు, ఎన్నికల్లో ఓటమికి కారణాలను విశ్లేషించకుండా పొంతలేని మాటలు చెబుతున్నారని విమర్శించారు. ప్రభుత్వం దశలవారీగా మద్య నిషేధాన్ని అమలుచేస్తుంటే, మద్యం ధరలు పెంచామని చంద్రబాబు విమర్శలు చేస్తున్నారని అన్నారు.