డబుల్బెడ్రూమ్ ఇండ్లకు నిధుల కొరత లేదని తెలంగాణ పంచాయితీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. పాలకుర్తి నియోజక వర్గంలోని అధికారులుతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దీపావళి వరకు మరికొన్ని డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణం పూర్తికావాలని అధికారులను ఆదేశించారు. మరో వారం పది రోజుల్లో కొన్ని ఇండ్లు దసరాలోపు, మరికొన్నిదీపావళి నాటికి పూర్తిచేస్తామన్నారు. కాంట్రాక్టర్లు నిర్లక్ష్యం కానీ అలసత్వం వహిస్తే వెంటనే వారి కాంట్రాక్ట్ను నిలిపి వేయడమే కాకుండా వారిని బ్లాక్లిస్ట్లో పెట్టాలని అధికారులను ఆదేశించారు.