telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

వెబ్ సిరీస్ ప్లాన్ చేస్తున్న అనిల్ రావిపూడి

కరోనా కారణంగా ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలో ఎన్నో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. థియేటర్స్ మూతపడటంతో ఓటీటీ వేదికలకు డిమాండ్ పెరుగుతోంది. ఇప్పటికే రామ్ గోపాల్ వర్మ, క్రిష్ లాంటి సీనియర్ డైరెక్టర్లు సైతం ఓటీటీ వేదికలపై సినిమాలు రూపొందిస్తుండగా, తాజాగా యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కూడా అదే బాటలో వెళ్లాలని ఫిక్స్ అయ్యారట. తాజాగా అనిల్ రావిపూడి వెబ్ సిరీస్ దిశగా అడుగులేస్తున్నారట. తన రెగ్యులర్ ఫార్మాట్ అయిన కామెడీ పండిస్తూ ఓ వెబ్ సిరీస్ ప్లాన్ చేస్తున్నారట అనిల్. అల్లు అరవింద్ ఆహా డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో దీనిని రిలీజ్ చేయాలని చూస్తున్నారట. ఈ ఏడాది ఆరంభంలోనే ‘సరిలేరు నీకెవ్వరు’తో వెండితెర వినోదం పంచిన అనిల్.. ప్రస్తుతం ఎఫ్ 3తో పాటు రామ్ చరణ్ కోసం కథ సిద్ధం చేస్తున్నట్లు టాక్ నడుస్తోంది.

Related posts