telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

రవితేజ, రానా మల్టీస్టారర్ సాగర్ చంద్ర దర్శకత్వంలో ?

Raviteja and Rana

టాలీవుడ్ లో మ‌రో క్రేజీ మల్టీస్టారర్ రాబోతున్నట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. మాస్ మ‌హరాజ్ రవితేజ, రానా కలిసి మలయాళ సినిమా ‘అయ్యప్పనుమ్‌ కోశియుమ్‌’ రీమేక్ లో నటించనున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీని తెలుగులో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ నిర్మించనుంది. త్వరలోనే అఫిషియ‌ల్ ప్ర‌క‌ట‌న‌ వెలువడే అవకాశం ఉంది. ఈ చిత్రానికి ఎవరు దర్శకత్వం వహిస్తారనే దానిపై ఇప్పటివరకు స్పష్టత రాలేదు. అయితే టాలీవుడ్‌ సర్కిళ్లలో వినిపిస్తున్న తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రానికి సాగర్‌ చంద్ర దర్శకత్వం వహించనున్నారట. ‘అయ్యారే, అప్పట్లో ఒకడుండే వాడు’ వంటి సెన్సిబుల్‌ చిత్రాలతో ఆకట్టుకున్న యంగ్‌ అండ్‌ ట్యాలెంటెడ్‌ డైరెక్టర్‌ సాగర్‌ చంద్రతో నిర్మాతలు చర్చలు జరుపుతున్నారని తెలుస్తోంది. తొలుత హరీశ్‌ శంకర్‌, సుధీర్‌ వర్మ వంటి యంగ్‌ డైరెక్టర్ల పేర్లు తెరపైకి వచ్చినప్పటికీ ఎవరూ ఫైనల్‌ కాలేదు. ఇప్పుడు సాగర్ చంద్ర పేరు విన్పిస్తోంది. మరి ఈ సినిమా అప్డేట్స్ తెలియాలంటే అఫిషియల్ ప్రకటన వచ్చే వరకు ఎదురు చూడాల్సిందే.

Related posts