చైనా నుండి వచ్చిన కరోనా ప్రపంచం మొత్తని అతలాకుతల చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ వైరస్ దేశంలో కరోనా అల్లకల్లోలం సృష్టిస్తోంది. రోజురోజుకు దేశంలో కరోనా కేసులు వేల సంఖ్యలో పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే ఎందరో రాజకీయ నాయకులు కరోనా బారిన పడ్డారు. అయితే.. తాజాగా బాలీవుడు బ్యూటీ అలియా భట్కు కరోనా సోకింది. ఈ విషయాన్ని స్వయంగా ఆమె ఇన్స్టాలో పోస్ట్ చేసింది. వైద్యుల సలహా మేరకు హోం క్వారంటైన్లో ఉన్నట్లు తెలిపింది. తన ఆరోగ్యం బాగానే ఉందని, ఇటీవల తనతో సన్నిహితంగా ఉన్నవారు కరోనా టెస్టులు చేయించుకోవాలని ఆమె సూచించింది. కాగా.. ఈ భామ ప్రస్తుతం పాన్ ఇండియా మూవీ ఆర్ఆర్ఆర్లో నటిస్తోంది. ట్రిపుల్ ఆర్లో ఎంతో ప్రతిష్టాత్మకమైన సీత పాత్రలో ఆమె నటిస్తోంది. ఇటీవల ఆర్ఆర్ఆర్ నుంచి అలియా భట్ లుక్ రిలీజ్ అయిన విషయం తెలిసిందే.