telugu navyamedia
సినిమా వార్తలు

భర్త కోసం జమున”స్వయంవరం”..

తెలుగు సినిమా రంగంలో శ్రీమతి జమున అనగానే అందరికీ గుర్తుకొచ్చేది సత్య భామ . నిజ జీవితంలో కూడా జమున లో ఆ జాణతనం వుంది. ఆ తెగువ, ధైర్యం , స్తైర్యం , ఆ పట్టుదల మరో కథానాయికలో మనం చూడలేము .జమునమూడు రోజుల క్రితమే 85వ సంవత్సరంలో అడుగు పెట్టింది . ఇప్పటికీ ఆరోగ్యంగా , ఉత్సాహంగా యువ కథానాయికలు స్ఫూర్తి నిస్తూనే వుంది .

జమున,1936 ఆగష్టు 30న నిప్పాణి శ్రీనివాసరావు , కౌసల్య దంపతులకు హంపిలో జన్మించింది. చిన్నప్పుడు ఆదుకు జనాబాయ్ అన్న పేరు పెట్టారు. ఆ తరువాత ఈ దంపతులు గుంటూరు జిల్లా తెనాలి తాలూకా దుగ్గిరాలకు మకాం మార్చారు . జామున ఇక్కడే పెరిగింది . చిన్నప్పటి నుంచి జమున కు నృత్యమన్నా, నటన అన్నా ఇష్టంగా ఉండేది . కూతురు ఆసక్తిని గమనించి శ్రీనివాసరావు నాటకాలలో ప్రోత్సహించారు .

అలా నాటకాలు వేస్తూ, నృత్యాలు చేస్తున్న జమునను చూసిన డాక్టర్ గరికపాటి రాజారావు తాను నిర్మించి దర్శకత్వం వహించే “పుట్టిల్లు ” సినిమాలో కథానాయికగా అవకాశం ఇచ్చాడు . 1952 లో ఈ సినిమా నిర్మాణమైంది . అప్పటికి జమున వయసు 16 సంవత్సరాలు .

సినిమా రంగంలో ఎలాంటి అండ లేకుండా అడుగు పెట్టిన జమునకు పుట్టిల్లు సినిమాలో మంచి పేరు వచ్చింది . ఆ తరువాత మా గోపి, బంగారు పాప, నిరుపేదలు , వద్దంటే డబ్బు , ఇద్దరు పెళ్ళాలు , దొంగరాముడు, సంతోషం ,మిస్సమ్మ సినిమాల్లో నటించింది . అక్కడ నుంచి జమున కు కథానాయికగా అవకాశాలతో పాటు స్టార్ స్టేటస్ కూడా వచ్చింది.

అలా సాగిపోతున్న జమున జీవితంలో 1959లో అనుకోని సంఘటన జరిగింది . తన ప్రక్కన నటించే ఓ హీరో అనుచిత ప్రవర్తన ఆమెను బాగా ఇబ్బంది పెట్టాయి . తన మాట మన్నించలేదని ఆ హీరో గారికి కోపం వచ్చింది . ఆ రకంగా జమున ను అక్కినేని నాగేశ్వర రావు , నందమూరి తారక రామారావు తమ ప్రక్క నటించకుండా బహిష్కరించారు. అయినా జమున భయపడలేదు , పిరికిదానిలా సినిమా రంగం నుంచి పారిపోలేదు .

ఆ ఇద్దరు అగ్ర హీరోలను కాదని దీరగా నిలబడింది . తన చిప్పటి నాటకాల్లో సహా నటుడు జగయ్య , మరో హీరో హరనాథ్ తో నటించడం మొదలు పెట్టింది. మూడు సంవత్సరాలు తనకంటూ పాత్రలను సృష్టించుకొని నటించింది తప్ప అగ్ర హీరోలకు సలాం అనలేదు .ఆ తరువాత నిర్మాత చక్రపాణి గారు అగ్రహీరోలను జమునను ఒకచోట సమావేశపరిచి మాట్లాడి రాజీ చేసి ‘గుండమ్మ కథ ” సినిమా మొదలు పెట్టాడు . ఆ వివాదం అలా సమసిపోయినా జమున లో అభద్రతా భావం ఉండేది.

అసలే తెలుగు సినిమా అంటే హీరోల ఆధిపత్యం ఎక్కువ. మళ్ళీ తనకు అలాంటి చేదు అనుభవం ఎదురు కాకూడదనే ఉద్దేశ్యం తో వివాహం చేసుకోవాలని నిర్ణయించుకుంది . ఆమె తల్లి తండ్రులు కూడా అదే సరైన నిర్ణయం అన్నారు . ఈ కుటుంబానికి సన్నిహితుడు , నిర్మాత డి .ఎల్ నారాయణతో చర్చించారు . డి .ఎల్ నారాయణ నిర్మించిన “దొంగల్లో దొర” , “సిపాయి కూతురు”, “దొరికితే దొంగలు” సినిమాల్లో నటించింది. తన సీనియర్ నాయికలు సినిమా రంగంలో వున్న వారిని వివాహం చేసుకొని ఎలాంటి మానసిక వ్యధ అనుభవిస్తున్నారో జమున స్వయంగా చేసింది .

అందుకే బయట వాళ్ళను చేసుకోవాలనుకుంది. మంచివాడు , విద్యావంతుడు అయితే కులం పట్టింపు కూడా లేదన్నారు . నిర్మాత నారాయణ ఈ విషయం తనకు వదిలి వెయ్యమన్నాడు .తమ వినోదా సంస్థ నిర్మించే సినిమాలో నటించడానికి అవకాశం ఇస్తామని , అందము చదువు వున్న వారు ఫోటోలు , వివరాలు పంపించమని ఓ ప్రక్కన తయారు చేయించి అన్ని పత్రికల్లో ఇచ్చాడు . ఐఏఎస్, ఐపీఎస్ , డాక్టర్లు , ఇంజినీర్లు కూడా హీరో కావాలని తమ వివరాలు పంపించారు . అలా వచ్చిన వాటిల్లో జమునతో సహా కుటుంబ సభ్యులు ఇద్దరినీ ఎంపిక చేసి వారి గురించి వాకబు చెయ్యమని డి ఎల్ కు చెప్పారు . అందులో ఐఏఎస్ అధికారి జమునతో వివాహం అనగానే ఎగిరి గంతేశాడు .అయితే ఆమె పేరుతో వున్న ఆస్తులు తన పేరు మీద పెట్టాలని షరతు విధించాడు . రెండు అతను డాక్టర్ అతను ఎలాంటి షరతులు పెట్టలేదు . కానీ అన్ని వ్యసనాలు ఉన్నాయని తేలింది .

అందుకే ఆ స్వయం వరం జమునకు కలసి రాలేదు .అదే సందర్భాల్లో జమున పెద నాన్న కుమారుడు సారధి తిరుపతి వుద్యోగం చేస్తున్నాడు . తన మిత్రుడు వున్నాడని, అబ్బాయి ఎంతో బుద్ధిమంతుడని, అందగాడని , ఎలాంటి దుర్వ్యసనాలు లేవని, అతను హైదరాబాద్ లో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో జూలజీ ప్రొఫెసర్ గా పనిచేసున్నాడని చెప్పాడు . పైగా అతను తమకు దూరపు చుట్టం అవుతాడని కూడా సారధి తెలిపాడు . అబ్బాయి గురించి అన్ని వివరాలు తెలుసుకున్నారు . అందరికీ నచ్చిన అతనే జూలూరి వెంకట రమణ రావు .
జమున , రమణరావు ల వివాహం 1965 ఆగష్టు 4న తిరుమల లో శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో జరిగింది . వీరిది అన్యోన్య దాపత్యం.వీరికి వంశీ , స్రవంతి ఇద్దరు సంతానం. రమణ రావు 2014లో చనిపోయాడు .
భగీరథ

Related posts