telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ప‌రుచూరి వెంక‌టేశ్వ‌ర‌రావు గారి భార్య మృతికి ‘మా” సంతాపం

Paruchuri

తెలుగు చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌లో ర‌చ‌యిత‌లుగా త‌మ‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్నారు పరుచూరి బ్ర‌ద‌ర్స్. ఈ రోజు ఉద‌యం ప‌రుచూరి వెంకటేశ్వరరావు గారు స‌తీమ‌ణి విజ‌య‌ల‌క్ష్మి (74) గుండెపోటుతో కన్నుమూసిన సంగ‌తి తెలిసిందే. దీంతో పరుచూరి ఇంట విషాదం నెల‌కొంది. విజ‌య‌ల‌క్ష్మీ గారి మృతికి ప‌లువురు సినీ ప్ర‌ముఖుల సంతాపం తెలియ‌జేస్తూ, వెంక‌టేశ్వ‌ర‌రావు గారికి మూవీ ఆర్టిస్టుల సంఘం త‌మ ప్ర‌గాఢ సానుభూతిని వ్య‌క్తం చేసింది. విజ‌య‌ల‌క్ష్మి గారి మ‌ర‌ణం ప‌రుచూరి కుటుంబానికి తీర‌ని లోటు అని ఆవేద‌న వ్య‌క్తం చేసింది.

Related posts