telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

జబర్దస్త్ టీం కు సైబర్ నేరగాళ్ల టోకరా…

జబర్దస్త్ లో అదిరే అభి టీంకు సైబర్ నేరగాళ్ల టోకరా వేశారు. అయితే జబర్దస్త్ ఫేమ్ అభి హీరోగా  గడ్డం నవీన్ ”పాయింట్ బ్లాంక్” అనే సినిమాను నిర్మించాడు. అయితే విడుదల కు ముందే ఈ సినిమా ఆన్లైన్ లోకి వచ్చింది. అయితే కొన్ని వెబ్సైట్లు, యు ట్యూబ్ ఛానళ్ళు ఈ సినిమాను పైరసీ చేశాయని, గడ్డం నవీన్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసాడు. ఈ సినిమా విడుదల హక్కులను అమెజాన్ ప్రైమ్.. ఆహ లకు ఇచ్చారు. ఫారెన్ లో ఈ సినిమాని అమెజాన్ ప్రైమ్ విడుదల చేసింది. దీంతో కొన్ని యు ట్యూబ్ ఛానళ్ళు సినిమాని విడుదల చేసాయి. సినిమా తెలుగు లో ఈ వారంలో విడుదల కానుండగా సినిమా లీక్ అవ్వడంతో సినిమా విడుదలను వాయిదా వేశారు. సినిమా లీక్ పై సైబర్ క్రైమ్ పోలీసులకు చిత్ర నిర్మాత ఫిర్యాదు చేసారు. అందరం కలిసి డబ్బు జమ చేసుకొని సినిమా తీశామని.. పోలీసులు స్పందించి సినిమాని పైరసీ నుంచి కాపాడాలని నిర్మాత అన్నారు. అయితే ఈ సినిమా ఓ క్రైం థ్రిల్లర్ గా తెరకెక్కుతుంది. ఈ మధ్యే విడుదలైన ఈ సినిమా ట్రైలర్ కు కూడా మంచి రెస్పాన్ వచ్చింది.

Related posts