కరోనా వైరస్ సోకి మరో జర్నలిస్టు ప్రాణాలు కోల్పోయాడు. తమిళనాడుకు చెందిన మణి అనే జర్నలిస్టు తిరుమలలో గత ఐదేళ్లుగా పనిచేస్తున్నాడు. ఇటీవల వైరస్ బారినపడిన ఆయన తిరుపతిలోని స్విమ్స్లో చికిత్స పొందుతున్నాడు. తాజాగా అతడి పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారు.
ఆయన మరణవార్త తెలిసిన సహచర జర్నలిస్టులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వార్త సేకరణకు వెళ్లాంటే జంకుతున్నారు. ఏపీలో ఇప్పటి వరకు ముగ్గురు జర్నలిస్టులు కరోనాతో కన్నుమూశారు. వారిలో ఇద్దరు కడప జిల్లా వారు కాగా, తాజా తిరుపతిలో మణి మృతి చెందాడు.