telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సినిమా వార్తలు

ఆగిపోయిన అడవి శేష్-శివానీ సినిమా…

విలక్షణమైన కథలతో ఎప్పటికప్పుడు ప్రేక్షకులకు కొత్తదనం పరిచయం చేస్తున్నాడు అడవి శేష్. అయితే హీరో రాజశేఖర్ కుమార్తె శివానీని కథానాయికగా పరిచయం చేస్తూ 2018లో సినిమాను ప్రారంభించారు. ఈ సినిమా హిందీ చిత్రం 2స్టేట్స్‌కు రీమెక్‌గా రూపొందించాలనుకున్నారు. ఈ సినిమా అడవి వేష్ హీరోగా వెంకట్ రెడ్డి దర్వకత్వంలో తెరకెక్కించేందుకు చూశారు. లక్ష్య ప్రొడక్షన్ బ్యానర్‌పై ఎంఎల్‌వీ సత్యనారాయణ(సత్తిబాబు) నిర్మిస్తున్నారు. ఈ సినిమా హైదరాబాద్‌లో అగ్రహీరోల సమక్షంలో ఘనంగా జరిగింది. తరువాత కొన్ని రోజులకి ఈ సినిమాను పక్కన పెట్టి అడవి శేష్ గూఢాచారి, ఎవరు వంటి సూపర్ హిట్ సినిమాలను తెరకెక్కించాడు. ప్రస్తుతం మేజర్ సినిమాతో అభిమానుల మందుకు వచ్చేందుకు సిద్దమవుతున్నాడు. అయితే 2స్టేట్స్ సినిమాతో పాటుగా శివానీ పరిచయం కూడా నిలిచిపోయింది. మరో సినిమాతో శికానీని పరిచయం చేసేందుకు చూస్తున్నారు. ఈ సినిమా ఆగిపోవడానికి హీరో అడవి శేష్ కారణమని నిర్మాత సత్తిబాబు అంటున్నారు. అడవి శేష్ తప్పుకోవడం వల్ల తనకు ఎంతో నష్టం వచ్చిందని కోర్టును ఆశ్రయించాడు. తనకు న్యాయం చేయాలని కోర్టులో పిటీషన్ దాఖలు చేశాడు. దీనిపై జనవరీ 5లోగా వివరణ ఇవ్వాలని కోర్టువారు అడవి శేష్‌కు నోటీసులు పాంపారు.

Related posts