ప్రధానమంత్రినిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాని ప్రత్యేక వస్త్రధారణలో స్వామివారిని దర్శించుకున్నారు. శనివారం ఉదయం ప్రత్యేక హెలికాప్టర్ దిగిన తర్వాత మోదీ నేరుగా ఆలయం దగ్గరకు వెళ్లారు. అక్కడ గుడి చుట్టూ ప్రదక్షిణ చేసిన తర్వాత కేదారీశ్వరుడి నరేంద్ర మోదీ కేదారీశ్వరుడి సన్నధిలో ఈ రోజు ప్రత్యేక పూజలు గర్భగుడిలోకి వెళ్లారు. మోదీ రాక సందర్భంగా ఆలయం చుట్టు రెడ్ కార్పెట్ పరిచారు. ఆ కార్పెట్పైనే మోదీ ప్రదక్షిణ చేశారు. ప్రత్యేక గెటప్లో ఉన్న మోదీని చూసి అక్కడకు వచ్చిన భక్తులు ఆచ్ఛర్యపోయారు.
ఇక ఆలయంలో సుమారు అరగంట సేపు మోదీ పూజలు చేశారు. బోలేనాథుడికి మోదీ రుద్రాభిషేకం, అర్చన చేశారు. ప్రధాని బాధ్యతలు చేపట్టిన తర్వాత మోదీ కేదార్నాథ్ వెళ్లడం ఇది నాలుగవ సారి. అర్చన తర్వాత గుడి బయటకు వచ్చిన మోదీ అక్కడ ఉన్న నందీశ్వరుడికి కూడా పూజలు చేశారు. ఆలయ అర్చకులు మోదీకి ఓ కట్టె, శాలువాను బహుకరించారు. ఇక ఉత్తరాఖండ్లో రెండు రోజుల పర్యటన సందర్భంగా ప్రధాని మోదీ ఆదివారం బద్రీనాథ్ వెళ్లనున్నారు. రేపు సాయంత్రం ఆయన తిరిగి ఢిల్లీ చేరుకుంటారు.
బందర్ పోర్టుని తెలంగాణకు ఎంతకు అమ్మేశారు: ప్రశ్నించిన దేవిదేని