telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

విద్యుత్ ఛార్జీల పెంపుపై ఏపీ కాంగ్రెస్ నిరసన

congress flags

ఏపీలో విద్యుత్ ఛార్జీలు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వ తీరును నిరసిస్తూ గుంటూరులోని పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ సందర్బంగా పార్టీ నేతలు మాట్లాడుతూ, విద్యుత్ శ్లాబులు మార్చి ప్రభుత్వం దొంగ దెబ్బ తీసిందని మండిపడ్డారు.

కరోనా సంక్షోభ సమయంలో వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరికాదని విమర్శించారు. పెంచిన విద్యుత్ బిల్లులను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో పోరాటాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ నిరసన దీక్షకు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలి, గుంటూరు జిల్లా కాంగ్రెస్ నేతలు హాజరయ్యారు.

Related posts