లాక్ డౌన్ కు ముందు భారత్ వచ్చి అనేకమంది ఎన్నారైలు చిక్కుకుపోయారు. దీనిపై ఓ యువతి చేసిన ట్వీట్ కు టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. 400 మందికి పైగా తెలుగు ఎన్నారైలు ఏపీలోనూ, ఇతర రాష్ట్రాల్లో చిక్కుకున్నారని, వారిని ఆదుకోవాలని కేంద్ర విదేశాంగ మంత్రి జయశంకర్ ను చంద్రబాబు కోరారు.
“జయశంకర్ గారూ ఎన్నారైల అంశాన్ని మీ దృష్టికి తీసుకువస్తున్నాను. లాక్ డౌన్ కు ముందు భారత్ వచ్చిన 400 మందికి పైగా తెలుగు ఎన్నారైలు ఇక్కడే నిలిచిపోయారు. ఈ ఎన్నారైల కుటుంబాలు అమెరికాలోనే ఉండిపోయాయి. వీళ్లేమో ఇక్కడ అమెరికా కాన్సులేట్ లో నాన్ ఇమ్మిగ్రెంట్ వీసాల జారీ ప్రక్రియ ప్రారంభం కోసం ఎదురుచూస్తున్నారు. దయచేసి ఈ సమస్యను పరిష్కరించండి” అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు.
కరోనా అనేది జబ్బే కాదని ప్రకటించిన ఏకైక సీఎం జగన్: కన్నా