నిజామాబాద్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఓ యువతి వేధింపులకు ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. అసలు వివరాల్లోకి వెళితే.. నిజామాబాద్ జిల్లాకు చెందిన 22 ఏళ్ల యువకుడు హైదరాబాద్లోని ఓ హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్నాడు. కొన్ని రోజుల కింద మొబైల్కు వచ్చిన ఓ మెసేజ్ అతడిని ఆకర్షించింది. తాను ఒంటరి మహిళలను అని, మీతో చాటింగ్ చేయాలనుకుంటున్నానని ఉన్న ఆ మెసేజ్కు రిప్లై ఇచ్చాడు ఆ యువకుడు. ఆ తర్వాత అటు నుంచి ఓ యువతి వీడియో కాల్ చేసి నగ్నంగా మాట్లాడింది. అతడిని కూడా నగ్నంగా మార్చేసింది. ఈ వీడియో సంభాషణను రికార్డు చేసిన ఆ యువతి.. డబ్బులు డిమాండ్ చేయడం స్టార్ట్ చేసింది. డబ్బులు ఇవ్వకపోతే.. యూ ట్యూబ్లో పెడతానని బెదిరించింది. దీంతో ఆ యువతి ఖాతాలో రూ. 24 వేలు ట్రాన్స్ఫర్ చేశాడు. అయినప్పటికీ ఆమె వేధింపులు ఆగలేదు. దీంతో నాలుగు రోజుల కింద స్వగ్రామానికి వచ్చి.. ఆ యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలిసిన కుటుంబ సభ్యులు సికింద్రాబాద్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడి చికిత్స పొందుతూ మంగళవారం ఆ యువకుడు మృతి చెందాడు. దీనిపై పోలీసులకు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం ఆ యువతి కోసం పోలీసులు గాలిస్తున్నారు
previous post