కాబూల్లో భారీ బాంబు పేలుడు సంభవించింది. పేలుడు దాటికి 40 మంది మృతిచెందగా మరో 100 మందికి పైగా వ్యక్తులు గాయపడ్డారు. క్షతగాత్రులను సమీప ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. గడిచిన రాత్రి 10.40 గంటలకు పశ్చిమ కాబూల్లోని ఓ పెండ్లి వేడుకలో బాంబు పేలుడు సంభవించినట్లు దేశ అంతర్గత వ్యవహారాలశాఖ ప్రతినిధి నస్రత్ రహీమి తెలిపారు.
పేలుడు తామే బాధ్యులమని ఇంతవరకు ఏ గ్రూప్ ప్రకటించలేదు. ఈ నెల 14న సైతం భద్రతా దళాలే లక్ష్యంగా తాలిబన్ల దాడికి పాల్పడ్డారు.