తెలంగాణలో జిల్లా, మండల పరిషత్ తొలి విడుత ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. మొత్తం 2,097 ఎంపీటీసీ, 195 జడ్పీటీసీ స్థానాల్లో జరుగుతున్న సంగతి తెలిసిందే. సోమవారం పంచాయితీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు దంపతులు ఓటు హక్కు వినియోగించుకున్నారు.
వరంగల్ జిల్లా పర్వతగిరీ మండలం కేంద్రంలోని 8 వార్డులో ఎర్రబెల్లి దయాకరరావు దంపతులు ఓటేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందబోస్తు ఏర్పాటు చేశారు.