telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

దేశంలో 75 లక్షలు దాటినా కరోనా కేసులు..

దేశంలో కరోనా విజృంభిస్తునే వుంది. తాజా కేసులతో దేశంలో 75 లక్షలు దాటింది కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య. గడచిన 24 గంటలలో 55,722 కరోనా పాజిటివ్ కేసులు నమోదవగా…కరోనా వల్ల మొత్తం 579 మంది మృతి చెందారు. ఇక గడచిన 24 గంటలలో దేశ వ్యాప్తంగా 66,399 డిశ్ఛార్జ్ అయ్యారు. దేశంలో ఇప్పటివరకు నమోదయిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 75,50,273 కాగా ….దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు 7,72,055 గా ఉన్నాయి. ఇక కరోనా కు చికిత్స పొంది డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 66,63,608 కి చేరింది. “కరోనా” వల్ల దేశంలో మొత్తం మృతి చెందిన వారి సంఖ్య 1,14,610 నమోదైంది. ఇటు దేశంలో కరోనా రోగుల రికవరీ రేటు 88.26శాతంగా ఉండగా… దేశంలో నమోదయిన మొత్తం కేసులలో “యాక్టివ్” కేసులు 10.23 శాతంగా ఉంది. దేశంలో మొత్తం నమోదయిన కేసులలో 1.52 శాతానికి మరణాల రేటు తగ్గింది. గడచిన 24 గంటలలో దేశవ్యాప్తంగా నిర్వహించిన “కరోనా” టెస్ట్ ల సంఖ్య 8,59,786 కాగా..ఇప్పటి వరకు దేశంలో నిర్వహించిన మొత్తం “కరోనా” టెస్ట్ ల సంఖ్య 9,50,83,976 కి చేరింది.

Related posts