telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

రాజధాని అంశంతో కేంద్రానికి సంబంధం లేదు: మంత్రి పెద్దిరెడ్డి

peddireddy minister

ఏపీ రాజధాని అంశంపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పందించారు. తిరుపతిలోని తన నివాసంలో ఆయనమీడియాతో మాట్లాడుతూ సీఎం జగన్ ప్రతిపాదించిన మూడు రాజధానులు అంశంతో కేంద్రానికి సంబంధం లేదని తెలిపారు. రాజధాని అనేది రాష్ట్ర పరిధిలోని అంశం అని స్పష్టం చేశారు.

పాలన వికేంద్రీకరణ జరిగితే అభివృద్ధి కూడా జరుగుతుందని అన్నారు. ఏదేమైనా సీఎం జగన్ నిర్ణయమే తమకు శిరోధార్యమని తెలిపారు. అమరావతిలో ఆందోళనలు చేస్తున్నవారు టీడీపీ కార్యకర్తలేనని, అమరావతిలో రైతులు ఎవరూ లేరని మంత్రి పేర్కొన్నారు. ఓ పార్టీకి చెందిన ఒకే సామాజికవర్గం వారు మాత్రమే అమరావతిలో భూములు కొన్నారని ఆరోపించారు.

Related posts