telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

మహారాష్ట్ర సీఎం ఇంట్లో కరోనా కలకలం… ఫ్యామిలీ మొత్తానికి !

చైనా నుండి వచ్చిన కరోనా మన దేశంలో దాదాపు ఏడాదికి పైగా ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తుంది . అయితే ఆ మధ్య కేసులు కాస్త తగ్గుముఖం పట్టిన ఇప్పుడు మళ్ళీ పెరుగుతున్నాయి. మన తెలంగాణలో కూడా ఈరోజు వచ్చిన కరోనా బులిటెన్ తో కేసులు 3 లక్షలు దాటేశాయి. అయితే ఇప్పటికే రాష్ట్రంలో కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు, ప్రముఖులు కరోనా బారినపడ్డారు.. తిరిగి కోలుకున్నారు. అయితే, తాజాగా మహారాష్ట్ర సీఎం ఉద్దవ్‌ ఠాక్రే సతీమణి రష్మి ఠాక్రే కు సైతం కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని అధికారులు వెల్లడించారు. కరోనా సోకడంతో ఆమె ఐసోలేషన్‌లో ఉన్నారని పేర్కొన్నారు అధికారులు. ఇక ఇటీవల ఉద్దవ్‌ తనయుడు ఆదిత్య ఠాక్రే సైతం మహమ్మారి బారిన పడిన విషయం తెలిసిందే. ఈ నెల 11న ఉద్దవ్‌ రాక్రే తో కలిసి రష్మి స్థానిక జేజే ఆస్పత్రిలో కరోనా వ్యాక్సిన్‌ మొదటి డోసు తీసుకున్నారు.

Related posts