telugu navyamedia
రాజకీయ వార్తలు

లడఖ్ లో పర్యటించిన మోదీ.. త్రివిధ దళాలపై ప్రశంసలు

modi ladakh

ప్రధాని నరేంద్ర మోదీ లడఖ్ లో ఆకస్మికంగా పర్యటించారు. ఈ సందర్భంగా భారత సైన్యాన్ని ఉద్దేశించి ప్రధాని ప్రసంగిస్తూ సైనికులు దేశ సరిహద్దుల్లో ఉండడం వల్లే దేశం మొత్తం నిశ్చింతగా ఉందని తెలిపారు. భారత త్రివిధ దళాలు అత్యంత శక్తివంతమైనవని ప్రశంసించారు. వేల సంవత్సరాలుగా భారత్ అనేక దాడులను తిప్పికొట్టిందని అన్నారు. ఇవాళ భారత్ శక్తి, సామర్థ్యాలు అజేయం అని వ్యాఖ్యానించారు.

ప్రపంచం మొత్తానికి భారత్ శక్తి సామర్థ్యాలు నిరూపించామని అన్నారు. లేహ్, లడఖ్, కార్గిల్, సియాచిన్, గాల్వన్ ఎక్కడైనా మన సైనికుల పరాక్రమం నిరూపితమైందని తెలిపారు. ఇవాళ దేశ ప్రజలందరి ఆశీస్సులు సైన్యానికి ఉన్నాయని పేర్కొన్నారు. యావత్ జాతి మిమ్మల్ని చూసి గర్విస్తోందని ఉద్వేగపూరితంగా ప్రసంగించారు. బలహీనులు శాంతి పొందలేరని, వీరత్వం ద్వారానే శాంతి లభిస్తుందని అభిప్రాయపడ్డారు.

Related posts