telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు సామాజిక

హెచ్‌సీయూ విద్యార్థినికి రూ.43 లక్షల ప్యాకేజీ

NandiniSoni hyd

హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్ సీయూ) విద్యార్థినికి క్యాంపస్ ప్లేస్‌మెంట్‌లో అడోబ్ సిస్టమ్స్ కంపెనీ భారీ ప్యాకేజీ ఆఫర్ చేసింది. స్కూల్‌ ఆఫ్‌ కంప్యూటర్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ సైన్సెస్‌లోని ఎంసీఏ విద్యార్థిని వి.నందిని సోనీకి క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భారీ ప్యాకేజీ లభించింది. అడోబ్ సిస్టమ్స్ కంపెనీలో రూ.43 లక్షల వార్షిక వేతనం లభించే ఉద్యోగానికి ఆమె ఎంపికైంది.దీంతో హెచ్‌సీయూలో చరిత్రలో ఇప్పటి వరకు అత్యధిక ప్యాకేజీ అందుకున్న విద్యార్థినిగా నందిని సోనీ నిలిచారు.

నందిని తన పాఠశాలను విద్యను మహారాష్ట్రలోని బోయిసర్‌ అటామిక్‌ ఎనర్జీ సెంట్రల్‌ స్కూల్‌లో పూర్తి చేశారు. అహ్మదాబాద్‌లోని సెయింట్‌ జేవీయర్స్‌ కళాశాలలో బీసీఏ చదివారు. కాగా, ఈ ఏడాది క్యాంపస్‌ ప్లేస్‌మెంట్‌లో 200 మందిపైగా విద్యార్థులు ఉద్యోగాలు సాధించారని హెచ్‌సీయూ ప్లేస్‌మెంట్‌ గైడెన్స్‌ అండ్‌ అడ్వైజరీ బ్యూరో చైర్మన్‌ రాజీవ్‌ వాంకర్‌ తెలిపారు. ఈ ప్యాకేజీ రావడంపట్ల విద్యార్థిని నందిని సంతోషం వ్యక్తం చేశారు. తాను తొలుత ఇంజినీరింగ్ కోర్సు చేయాలనుకున్నానని, అనంతరం నైపుణ్యం కలగిన సాఫ్ట్ వేర్ డెవలపర్ కావాలన్న లక్ష్యంతో ఎంసీఏ లో చేరినట్లు వెల్లడించారు.

Related posts