తెలంగాణలో కరోనా వైరస్ బాధితుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ స్పందించారు. తెలంగాణలో ఇప్పటి వరకు ‘కరోనా’ పాజిటివ్ కేసుల సంఖ్య 33 కు చేరినట్లు వెల్లడించారు. హైదరాబాద్ లోని కోఠి కమాండ్ సెంటర్ లో ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాలతో మంత్రి ఈటల సమావేశం నిర్వహించారు.
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కరోనా ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. రాష్ట్ర ప్రైవేట్ వైద్య కళాశాలలో 15,040 పడకలు సిద్ధంగా ఉన్నాయని వివరించారు. పీజీ వైద్య విద్యార్థుల సేవలతో పాటు నర్సింగ్, పారా మెడికల్ విద్యార్థుల సేవలను వినియోగించుకుంటామని అన్నారు. ఈ సమావేశంలో డీఎంఈ రమేశ్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి పాల్గొన్నారు.
వైసీపీకి ధైర్యముంటే మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలి : కవిత