తమిళనాడులో కరోనా మహమ్మారి రోజురోజుకూ చాపాకింద నీరులా విజృంభిస్తోంది. ఇటీవల పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గినట్లే తగ్గి గత రెండు రోజులుగా మళ్లీ వేగం పుంజుకొంది. గురువారం ఒక్కరోజే తమిళనాడులో కొత్తగా 96 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 834కి చేరింది.
బాధితుల్లో 27 మంది ఇప్పటికే కరోనా బారినుంచి పూర్తిగా కోలుకుని డిశ్చార్జి అయ్యారు. మరో ఎనిమిది మంది చనిపోయారు. ఇక కొత్తగా నమోదైన 96 కేసుల్లో 84 మంది ఢిల్లీలో మర్కజ్ ప్రార్థనలకు వెళ్లివచ్చిన వారేనని తమిళనాడు ఆరోగ్యశాఖ కార్యదర్శి బీలా రాజేష్ తెలిపారు.