telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

కేంద్రానికి వైసీపీ షాక్‌..భారత్ బంద్‌ సంపూర్ణ మద్దతు

ఈ నెల 26వ తేదీన భారత్ బందుకు ఏపీప్రభుత్వం మద్జతు ఇస్తోందని మంత్రి పేర్ని నాని తెలిపారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేస్తోన్న బంద్‌కు మద్దతు ఉంటుందని… కేంద్ర విధానాలకు వ్యతిరేకంగా రైతులు చేపడుతోన్న బంద్‌కు మద్దతు ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. విశాఖ స్టీల్ ప్లాంటును మేం కొంటామని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించినా కేంద్రం తిరస్కరించిందని…
ప్రైవేట్ వ్యక్తులతో కలిసి బిడ్డింగులో పాల్గొనాలని కేంద్రం సూచించిందన్నారు. ప్రత్యేక హోదా ఇవ్వకుంటే కాంగ్రెస్ పార్టీకి పట్టిన గతే బీజేపీకి పట్టే పరిస్థితి వస్తుందని… ప్రత్యేక హోదా గురించి టీడీపీకి మాట్లాడే హక్కే లేదని ఫైర్‌ అయ్యారు. బీజేపీ చెప్పులు తుడిచే పనిలో టీడీపీ బీజీగా ఉందని.. ఇసుక అక్రమాలు చంద్రబాబు హయాంలోనే ఎక్కువగా జరిగాయన్నారు. గత ప్రభుత్వంలో ఇసుక పంచాయతీలను అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ సర్దుబాటు చేసేవారని విమర్శలు వచ్చాయని… ఇసుక ప్రైవేట్ వారికి అప్పగించడం ద్వారా రూ. 765 కోట్లు ప్రభుత్వ ఖజానాకు వస్తోందని పేర్కొన్నారు. గత ఐదేళ్ల కాలంలో ఈ మొత్తం ఎక్కడికి పోయింది..? ప్రశ్నించారు పేర్ని నాని.

Related posts