telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

జోగురామన్నకు టికెట్ రాకుండా చేస్తా: ఎంపీ సోయం

soyam bapu rao

 ఆదిలాబాద్  టీఆర్ఎస్ ఎమ్మెల్యే  జోగురామన్నపై బీజేపీ ఎంపీ సోయం బాపూరావు విరుచుకుపడ్డారు. జోగు రామన్న తనపై అనవసర విమర్శలు చేస్తే ఊరుకోమని చెప్పారు. తాను తలుచుకుంటే ఎమ్మెల్యే జోగురామన్నకు టికెట్ రాకుండా చేస్తానని హెచ్చరించారు. రెండు సార్లు టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినప్పటికీ ఆదిలాబాద్ సీసీఐ పరిశ్రమను తిరిగి ప్రారంభించలేకపోయిందని విమర్శించారు.

సీసీఐ భూ నిర్వాసితుల రిలే దీక్షను సోయం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీసీఐ విషయంలో స్థానిక టీఆర్ఎస్ శాసన సభ్యుడు జోగురామన్న ఈ విషయంలో ప్రయత్నం చేయడంలో విఫలమయ్యారని ధ్వజమెత్తారు. భూ నిర్వాసితులకు న్యాయం చేయడానికి తనవంతు ప్రయత్నం చేస్తానని సోయం వెల్లడించారు.

Related posts