telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్ వార్తలు

మన ఆయుష్షు ఎలా పెంచుకోవాలి.. అసలు రహస్యం ఇదే !

శ్వాస : మనిషి నిమిషానికి “15 సార్లు” శ్వాస తీస్తాడు…100 నుండి 120 సం.. బ్రతుకు తాడు.తాబేలు నిమిషానికి “3 సార్లు” శ్వాస తీస్తుంది…500 సం. లు బ్రతుకు తుంది. ఐతే ప్రాణాయామం ద్వారా ‘శ్వాస’ లు తగ్గించడం వలన ఆయుష్షు ఎలా పెరుగు తుంది….? దీనిని సశాస్త్రీయం గా వివరించే ‘వ్యాసం’ ఇది… అప్పుడు ప్రాణాయామం యొక్క శక్తి,గొప్ప దనం ఏమిటో మనకు తెలుస్తుంది.

మన శరీరం కోట్ల కణాల కలయిక వలన ఏర్పడింది. ఒక గ్రామ్ మానవ మాంసం లో కోటాను కోట్ల కణాలు ఉంటాయి. వీటినే ” సెల్స్” అంటాం. ఈ ప్రతి కణంలోనూ ‘మైటోకాండ్రియా (హరిత రేణువు) అనే ప్రత్యేక కణ వ్యవస్థ ఉంటుంది. ఈ మైటోకాండ్రియా- మనం శ్వాస తీసు కున్నప్పుడు,గాలి లోని ‘ఆక్సిజన్’ ను తీసుకుని మండిస్తుంది. దీని ద్వారా “ఉష్ణం” జనిస్తుంది. ఈ ఉష్ణమే మనం ప్రాణాలతో ఉండటానికి కావలసిన ” ప్రాణశక్తి”.
ఇలా శరీరంలోని కాలి గోరు నుండి తల వెంట్రుకలు చివర వరకూ ఉన్న ప్రతి కణం లోనూ ఉష్ణం జనిస్తున్నది…

ఇలా ఒక్కొక్క కణం నిమిషానికి,15 సార్లు ఉష్ణాన్ని జనింపజేస్తుంది. ఎందుకంటే, మనం నిమిషానికి “15 సార్లు” శ్వాస తీసుకుంటాం కాబట్టి… ఇలాంటి కణం 3 రోజులు ఏకధాటి గా పని చేసి, తరువాత ఉష్ణాన్ని పుట్టించే సామర్థ్యం కోల్పోయి మరణిస్తుంది… ఇలాంటి మృత కణాలు మలినాల రూపం లో శరీరం లోంచి బయటకు వెళ్లిపోతాయి. ఎప్పుడైతే ఒక మృత కణం బయటికి వెళ్లిందో,ఆ స్థలంలో ఒక కొత్త కణం మనం తీసుకొనే ఆహారం ద్వారా తయారవు తుంది……

ఉదాహరణకు – మన గుండెలో 1000 మృత కణాలు తయారయ్యాయి,అను కుంటే…
ఆ కణాలన్నీ విసర్జన అనగా చెమట,ఉమ్మి,మూత్రం ద్వారా బయటికి వెళ్ళి పోయి, గుండెలో ఖాళీ ఏర్పడినప్పుడు మాత్రమే…ఆ స్థలంలో కొత్తకణాలు తయారవు తాయి. పాత వాటిని ఖాళీ చేస్తేనే…కొత్తవి రాగల్గుతాయి.అందుకే ప్రతి దినం మన మల విసర్జన క్రియ అతి ముఖ్యమైనది.

ఎవరైతే మల విసర్జన సరిగా చెయ్యరో…వారి శరీరం నిండా ఈ “మృత కణాలు(toxins)” నిండిపోయి,
సరిగా ఉష్ణం జనించక…తీవ్ర రోగాల బారిన పడతారు…కనుక ఈ టాక్సిన్ లను బయటికి పంపే “డిటాక్సీఫీకేషన్ (విసర్జన)” చాలా ముఖ్యం. ఒక కణం 15 సార్లు ఉష్ణాన్ని ఉత్పత్తి చేస్తే…3 రోజులు జీవిస్తుంది. అదే కణం 14 సార్లు ఉష్ణాన్ని ఉత్పత్తి చేస్తే…5 రోజులు జీవిస్తుంది……13 సార్లు ఉష్ణాన్ని ఉత్పత్తి చేస్తే…7 రోజులు జీవిస్తుంది……

ఈ విధంగా మనం.. ‘శ్వాస’ ల సంఖ్యను తగ్గించే కొద్దీ…మన కణాలు పని చేసే కాలం పెరుగు తుంది. ఎలా ఐతే ఒక యంత్రం దగ్గర ఎక్కువ పని చేయిస్తే…త్వరగా చేస్తుందో……అలాగే ఈ కణాలు కూడా……భారతీయ యోగులు కణం యొక్క జీవిత కాలాన్ని… 3 నుండి 21 రోజుల వరకూ పెంచి…2100 సంవత్సరాలు కూడా జీవించ గలిగారు.

మనం శ్వాసను ఎక్కువ తీసుకునే కొద్దీ…శరీరంలోని ప్రతీ కణం పై తీవ్ర పని ఒత్తిడి పడి…ఆ కణం త్వరగా పాడై పోతుంది. ప్రాణ యామ సాధన ద్వారా “శ్వాస” ల సంఖ్యను తగ్గించి కణాల పని రోజులని పెంచ గల్గితే…… మన శరీరంలోని ప్రతి అవయం మరి కొన్ని రోజులు ఎక్కువగా పని చేస్తుంది… ఎందుకంటే…… అవయవాలు అంటే…కణాల సముదాయమే. ఇలా మనలోని ప్రతీ అవయవం యొక్క…ఆయుష్షు పెరిగితే… మన ఆయుష్షు కూడా పెరిగినట్టే కదా.!! మనం ఒక్క “శ్వాస”ను తగ్గించ గల్గితే…20 సంవత్సరాల ఆయుష్షును పెంచు కోవచ్చు…యోగులు… ఈ శ్వాసల సంఖ్యను గణించడం ద్వారానే… తాము… ఏ రోజు…మరణించేదీ…ముందే చెబుతారు

Related posts