telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

షాకింగ్ : ప్రియాంక చోప్రాకు లీగల్ నోటీసు… ఆ బయోపిక్ కు అభ్యంతరం

Priyanka

మాజీ విశ్వసుందరి ప్రియాంక చోప్రా లేటెస్ట్‌గా ఓ బయోపిక్‌ను ప్రకటించింది. వివాదాస్పద భారతీయగురు ఓషో శిష్యురాలు ‘మా ఆనంద్ షీలా’ కథతో సినిమాని తెరకెక్కించబోతున్నట్టు ఇటీవల “ద ఎల్లెన్ షో”లో (The Ellen Show) తెలిపింది. ‘మా ఆనంద్ షీలా’ బయోపిక్‌లో నటించడమే కాకుండా.. ఈ చిత్రానికి నిర్మాతగానూ వ్యవహరించబోతుంది ప్రియాంక. హాలీవుడ్‌లో ‘రెయిన్ మేన్’ వంటి పాపులర్ మూవీని తీసిన బ్యారీ లెవిన్సన్ ఈ సినిమాకి దర్శకత్వం వహించనున్నాడట. అయితే.. ఒషో శిష్యురాలి బయోపిక్‌ను భారీ రేంజ్ లో మొదలుపెట్టాలనుకున్న ప్రియాంకకు ఆదిలోనే పెద్ద షాక్ తగిలింది. తన బయోపిక్‌లో నటించడానికి పర్మిషన్ ఇవ్వనంటూ ఏకంగా ఓషో శిష్యురాలు మా ఆనంద్ షీలా ప్రియాంకకు లీగల్ నోటీస్ పంపించిందట. ఓషో జీవితంలో కీలక భూమిక పోషించిన మా ఆనంద్ షీలా కథతో ఇప్పటికే నెట్‌ఫ్లిక్స్‌ ఓ సిరీస్‌ చేసేసింది. ‘వైల్డ్ వైల్డ్ కంట్రీ’ పేరుతో వచ్చిన ఆ సిరీస్‌ మంచి ప్రేక్షకాదరణ పొందింది. ఇప్పుడు మళ్లీ అదే కథను ప్రియాంక చేయబోతుంది. అయితే.. ప్రియాంక చోప్రా చేయబోతున్న బయోపిక్‌కి.. మా ఆనంద్ షీలా అభ్యంతరం వెనుక కారణం ఉందట. అదేమిటంటే.. సినిమాలో తన పాత్రను ప్రియాంక కాకుండా.. అలియా భట్ పోషించాలని కండిషన్ పెట్టిందట. ఎందుకంటే 69 ఏళ్ల మా ఆనంద్ షీలా యుక్త వయసులో అచ్చం అలియా భట్ లాగే ఉండేదట. అందుకే.. అలియా భట్ చేస్తేనే తన బయోపిక్‌ తీయాలి అంటూ.. ప్రియాంక చోప్రాకి లీగల్ నోటీసులు పంపించిందట. మరి.. ప్రియాంక ప్రతిష్ఠాత్మకంగా తలపెట్టిన మా ఆనంద్ షీలా బయోపిక్‌ ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి.

Related posts