telugu navyamedia
క్రీడలు వార్తలు

పెవిలియన్ కు చేరుకున్న పుజారా….

భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న మొదటి టెస్ట్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 578 పరుగులకు ఆల్ ఔట్ అయ్యింది. అయితే ఈ రోజు తమ మొదటి ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ కు ఆర్చర్ మొదట్లోనే రోహిత్(6) ఔట్ చేసి షాక్ ఇచ్చాడు. ఆ తర్వాత మరో ఓపెనర్ గిల్(29) కూడా ఆర్చర్ పెవిలియన్ కు చేర్చగా కోహ్లీ(11), రహానే(1) లను వెనక్కి పంపించి డోమ్ బెస్ భారత్ ను కష్టాలో నెట్టాడు. కానీ ఆ తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన పంత్ త పద్దతిలో చెలరేగుతూ దూకుడుగా ఆడుతుండగా పుజారా నిలకడగా రాణిస్తున్నాడు. ఈ సమయంలోనే వీరిద్దరూ తమ అర్ధశతకాలు కూడా పూర్తి చేసుకున్నారు. అయితే 73 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాలో ఉన్న జట్టును పంత్, పుజారా కలిసి ఆదుకున్నారు. నిలకడగా రాణిస్తున్న ఈ జోడీని డోమ్ బెస్వి డదీసాడు. 73 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద పుజారా క్యాచ్ రూపంలో పెవిలియన్ కు చేరుకున్నాడు. అయితే పుజారా, పంత్ వీరిద్దరూ 5 వ వికెట్ కు 119 పరుగుల భాగసౌమ్యం నెలకొల్పారు. అయితే పుజారా ఔట్ కావడంతో 82 పరుగులతో రాణిస్తున్న పంత్ తో కలిసి బ్యాటింగ్ చేయడానికి సుందర్ వచ్చాడు. ఇక ఈరోజు మ్యాచ్ ముగియడానికి ఇంకా 24 ఓవర్లు ఉండగా భారత్ ఇంగ్లాండ్ కంటే 386 పరుగులు వెనకబడి ఉంది. చూడాలి మరి ఇంకా ఏం జరుగుతుంది అనేది.

Related posts