telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

విశాఖను దెబ్బతీసింది జగనే: లోకేశ్

Minister Lokesh comments YS Jagan

ఏపీ సీఎం జగన్ పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మరోసారి విరుచుకుపడ్డారు. విశాఖను దెబ్బతీసింది జగనేనని మండిపడ్డారు. గతంలో తన తల్లిని ఎన్నికల్లో ఓడించారన్న ద్వేషంతో ఉత్తరాంధ్ర నడ్డివిరిచేలా జీఎన్ రావు కమిటీతో విషం కక్కారని మండిపడ్డారు.

ఉత్తరాంధ్రకు కంపెనీలు రాకుండా, పెట్టుబడులు రాకుండా చేసి జీఎన్ రావు కమిటీ రిపోర్ట్ తో దారుణంగా దెబ్బతీశారని ట్విట్టర్ లో నిప్పులు చెరిగారు.తుపానులు వస్తాయని, ఉప్పునీరు చొచ్చుకుని వస్తుందని, భద్రత ఉండదని కుట్రపూరితంగా రిపోర్ట్ రాయించారని ఆరోపించారు. ఈ రిపోర్ట్ తో ఒక్క రూపాయి పెట్టుబడి పెట్టడానికి కూడా ఎవరూ ముందుకు రాకుండా చేశారని లోకేశ్ జగన్ పై ధ్వజమెత్తారు.

Related posts