భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ, మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ ప్రస్తుత క్రికెట్లో దిగ్గజ ఆటగాళ్లు. క్రీజులో ఉన్నా.. స్టేడియంలో కూర్చున్నా వారిద్దరినీ చూస్తుంటే అభిమానులకు ఓ జోష్. అంతర్జాతీయ క్రికెట్లో రికార్డుల వర్షం కురిపించిన వీరిద్దరికీ సోషల్ మీడియాలోనూ అదే రేంజ్ లో ఫాలోయింగ్ ఉంది.
ఈ క్రమంలోనే ధోనీ పుట్టినరోజుకు విరాట్ కోహ్లీ చేసిన ట్వీట్ ఈ సంవత్సరం మొత్తంలో టాప్ గా నిలిచింది. ఈ ఏడాది ఒక ట్వీట్ను అత్యధికంగా రీట్వీట్ అయిన ఘనత దక్కించుకుంది. ట్విటర్ ఇండియా ఈ విషయాన్ని అధికారికంగా ట్విట్టర్ ఖాతా ద్వారా పోస్టు చేసింది.