ఏపీ సీఎం జగన్ బాధ్యతలు చేపట్టిన తర్వాత పాలన పై ప్రత్యేక దృష్టి సారించారు. ప్రతి విషయంలోనూ తనదైన ముద్ర వేస్తూ ముందుకు సాగుతున్నారు. ఐదుగురు డిప్యూటీ సీఎంలు, మంత్రిపదవులపై ఎవరికీ గ్యారంటీ ఇవ్వకపోవడం వంటి అంశాలతో జగన్ ప్రత్యేకత చాటుకున్నారు. మంత్రివర్గంలో కూడా అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించిన ఆయన ముఖ్యంగా బీసీలకు పెద్దపీట వేశారు. దీనిపై ట్వీట్ చేశారు.
బీసీలు అంటే ఇకమీదట బ్యాక్ వర్డ్ క్లాస్ కాదని, బీసీలు అంటే బ్యాక్ బోన్ క్లాస్ అని సరికొత్త భాష్యం చెప్పారు. అందుకే తమ మంత్రివర్గంలో 60 శాతం మంది బీసీలకే ప్రాధాన్యం ఇచ్చామని వివరించారు. ఐదుగురు ఉపముఖ్యమంత్రుల్లో నలుగురు బీసీలేనని సీఎం స్పష్టం చేశారు. ఆఖరికి స్పీకర్ విషయంలోనూ తమ నిబద్ధత చాటుకున్నామని, తమ్మినేని సీతారాంను ఎంపిక చేయడం ద్వారా ఆ విషయాన్ని నిరూపించుకున్నామని జగన్ తన ట్వీట్ లో పేర్కొన్నారు.
ఫామ్ హౌస్, ప్రగతి భవన్, పబ్లిక్ మీటింగ్లకే..కేసీఆర్ పై పొన్నాల విమర్శలు