జాతీయ భద్రతపై డీజీల వార్షిక సదస్సుకు హాజరయ్యేందుకు ఈరోజు ప్రధాని మోదీ పూణె వచ్చారు. ఈ సందర్భంగా పూణె విమానాశ్రయంలో ఆయనకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే ఘన స్వాగతం పలికారు.
ప్రొటోకాల్ ప్రకారం పూణె విమానాశ్రయంలో స్వాగతం పలికేందుకు థాకరే వచ్చారు. ఎన్డీయే నుంచి తప్పుకొని, మాహారాష్ట్ర సీఎంగా బాధ్యతలను స్వీకరించిన తర్వాత మోదీని థాకరే కలవడం ఇదే తొలిసారి. థాకరే ప్రమాణస్వీకారానికి మోదీ హాజరుకానప్పటికీ, ఫోన్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు.