telugu navyamedia
క్రైమ్ వార్తలు తెలంగాణ వార్తలు వార్తలు

ఎన్ కౌంటర్ పై వివరాలు కోరిన మానవ హక్కుల సంఘం!

disa accused encountered on escaping

శంషాబాద్ కు చెందిన వెటర్నరీ డాక్టర్ దిశపై హత్యాచారానికి పాల్పడ్డ నిందితులను పోలీసులు ఈ రోజు ఎన్ కౌంటర్ లో కాల్చిచంపిన విషయం తెలిసిందే. వారు పారిపోయేందుకు ప్రయత్నించడంతోనే తాము కాల్పులు జరిపామని వారు అంటున్నారు. అయితే, దీనిపై పలువురు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఎన్ కౌంటర్ పై స్పందించిన జాతీయ మానవ హక్కుల సంఘం హైదరాబాద్ పోలీసులకు నోటీసులు జారీ చేసింది. దీనిపై తమకు సమాధానం చెప్పాలని సూచించింది.

మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా సుమోటోగా కేసు నమోదు చేసినట్లు జాతీయ మానవ హక్కుల సంఘం తెలిపింది. కాగా, దిశ హత్య కేసులో నిందితుల ఎన్ కౌంటర్ పై దేశ వ్యాప్తంగా ప్రజలతో పాటు పలువురు ప్రముఖులు మద్దతు తెలుపుతున్నారు. కొందరు మాత్రం పోలీసుల చర్యను వ్యతిరేకిస్తున్నారు.

Related posts