telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

పరీక్షల రద్దు పై గవర్నర్ కు లేఖ రాసిన నారా లోకేష్…

Nara Lokesh

రాష్ట్రంలో పది, ఇంటర్ పరీక్షలు రద్దుకు జోక్యం చేసుకోవాలని గవర్నర్ గారికి లేఖ రాసాను అని నారా లోకేష్ ట్విట్ చేసారు. ప్రభుత్వం నిర్వహించే ఇంటర్, పదో తరగతి పరీక్షలకు 16.3లక్షల మంది హాజరు కావాల్సి ఉంటుంది. కరోనా రెండో దశ తీవ్రతలో పరీక్షల నిర్వహణ విద్యార్థులకు ప్రాణసంకటంగా మారుతుంది. దేశంలోని దాదాపు 20రాష్ట్రాలు, 10, 12వ తరగతి విద్యార్థులకు పరీక్షలు వాయిదా వేయటం లేదా రద్దు చేశాయి. ఇందుకు విరుద్ధంగా ఏపీలో పరీక్షలు నిర్వహించాలనుకోవటం కరోనా వైరస్ ను మరింత వ్యాప్తి చేయటమే. లక్షలాది మందికి సురక్షితమైన వాతావరణం కల్పించటం అసాధ్యం. ఏ ఒక్క విద్యార్థి కరోనా బారిన పడి చనిపోయినా అది క్షమించరాని నేరమే అవుతుంది. మీకున్న విశేష అధికారాలతో పరీక్షల నిర్వహణపై జోక్యం చేసుకోవాలని గవర్నర్ గారిని కోరాను. ఆన్ లైన్ ద్వారా వచ్చిన అభిప్రాయాలతో కూడిన 1778 పేజీలను ఈ లేఖకు జత చేసి పంపాను.

Related posts