telugu navyamedia
రాజకీయ వార్తలు

ఉగ్రవాదులకు మద్ధతు ఇస్తే పాక్ కు నీళ్లు ఆపేస్తాం: నితిన్ గడ్కరీ

Nitin-Gadkari

ఉగ్రవాదం విషయంలో పాకిస్థాన్ వైఖరి మారకుంటే ఆ దేశానికి వెళ్లే ఇండస్ నదీ నీటిని నిలిపివేస్తామని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ హెచ్చరించారు. భారతదేశం నుంచి పాకిస్థాన్ దేశానికి ఇండస్ నదీ ద్వార నీరు వెళుతోందని, రెండు దేశాల మధ్య శాంతియుత పరిస్థితులు కొనసాగినంత కాలం నదీ నీటిని ఆ దేశానికి విడుదల చేస్తామన్నారు. కాని పాకిస్థాన్ ఉగ్రవాదులకు సహాయ సహకారాలు కొనసాగితే మాత్రం ఇండస్ నదీ నీటిని ఆ దేశానికి విడుదల చేసేదిలేదని గడ్కరీ హెచ్చరించారు.

ఇండస్ నదిలో ప్రవహిస్తున్న నీరు హర్యానా, పంజాబ్, రాజస్థాన్ రాష్ట్రాల నుంచి వస్తుందని మంత్రి చెప్పారు. 1960వ సంవత్సరంలో మాజీ ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ అప్పటి పాక్ అధ్యక్షుడు అయూబ్ ఖాన్ తో కలిసి నదీజలాల పంపకం విషయంలో ఒప్పందం కుదిరింది. ఆ ఒప్పందం ప్రకారం రవి, బీయాస్, సట్లైజ్ నదీ జలాల వినియోగంపై భారతదేశానికి పూర్తి హక్కులున్నాయని తెలిపారు.

Related posts