telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

‘బ్రాందీ’ హైదరాబాద్ గా మార్చారు: లక్ష్మణ్

BJPpresident -K-Laxman

తెలంగాణ రాష్ట్రంలో మద్యపానాన్ని నిషేధించాలని డిమాండ్ చేస్తూ.. మాజీ మంత్రి, బీజేపీ నేత డీకే అరుణ చేపట్టిన మహిళా సంకల్ప దీక్షకు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ మద్దతు పలుకుతూ దీక్షను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ప్రభుత్వ విధానాలపై విరుచుకుపడ్డారు. ‘హైదరాబాద్ బ్రాండ్’ అంటూ ట్వీట్ చేసే కేటీఆర్ ‘బ్రాందీ’ హైదరాబాద్ గా మార్చారని విమర్శించారు. బీజేపీ మహిళా సంకల్ప దీక్షతో ప్రభుత్వానికి జ్ఞానోదయం కలగాలని పేర్కొన్నారు.

తెలంగాణను తాగుబోతుల రాష్ట్రంగా మార్చారని మండిపడ్డారు. భవిష్యత్తులో ఏ తల్లి కడుపుకోతకు మద్యం కారణం కాకూడదన్నారు. సీఎం కేసీఆర్ సామాజిక బాధ్యతను గుర్తెరిగి మద్యాన్ని నిషేధించాలని డిమాండ్ చేశారు. రాజకీయ ప్రయోజనాలకోసం దీక్ష చేయడంలేదని చెప్పారు. మహిళలపై అత్యాచారాలు, హత్యలను నిరోధించేందుకే తాము సంకల్ప దీక్ష చేపట్టామన్నారు. ఈ దీక్షతో.. తమ ఉద్యమం ఆగదన్నారు. మద్య నిషేధం కోరుతూ ఉద్యమాన్ని మరింత తీవ్రం చేస్తామని అన్నారు. గ్రామాల్లో బెల్టు షాపులను మూసివేయాలని డిమాండ్ చేశారు.

Related posts