లాక్డౌన్ సమయంలో షూటింగ్లకు దూరంగా ఉంటున్న సినీ తారలందరూ సోషల్ మీడియాలో వారి ఫోటోలు, వీడియోలను షేర్ చేస్తూ అభిమానులకు మాత్రం దగ్గరగా ఉంటున్నారు. ఈ లాక్ డౌన్ సమయంలో వారు చేస్తున్న పనులు, నేర్చుకుంటోన్న కొత్త విషయాల గురించి అభిమానులతో పంచుకుంటున్నారు. ఇక సమంత, చైతన్య వాళ్ళ పెట్ డాగ్తో సమయాన్ని సరదాగా గడుపుతున్నారు. అంతే కాకుండా తాజాగా అర్బన్ కిసాన్ వారితో కలిసి ఇంటి టెర్రస్ మీద వెజిటబుల్ గార్డెన్ను ఏర్పాటు చేసింది సమంత. సేంద్రీయ పద్ధతుల్లో వ్యవసాయం చేస్తున్న సమంత ఆ ఫొటోలను తన సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేశారు. పెళ్లికి ముందే మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్న సమంత పెళ్లి తర్వాత కూడా అదే బాటలో నడుస్తూ సినీ ఇండస్ట్రీని ఏలుతున్నది. సినిమాలతో ఎప్పుడూ బిజీగా ఉండే సామ్ లాక్డౌన్లో కుటుంబంతో సంతోషంగా గడుపుతున్నది. దీంతో సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉంటోంది సమంత.
previous post
రాజకీయాలంటే అసహ్యం… సంచలనం సృష్టిస్తున్న హాలీవుడ్ నట దిగ్గజం వ్యాఖ్యలు