telugu navyamedia
క్రైమ్ వార్తలు వార్తలు సామాజిక

కరోనా కట్టడికి ఔషధం తయారు చేశాడు.. తాగి ప్రాణాలు కోల్పోయాడు!

Corona

కరోనా మహమ్మారి ప్రపంచదేశాలను అల్లాడిస్తున్న నేపథ్యంలో ఔషధం తయారు కోసం ఎందరో ప్రయోగాలు చేస్తున్నారు. ఈ క్రమంలో కరోనా వైరస్ నివారణ కోసం తాను తయారుచేసిన మందును తాగి ఓ ఆయుర్వేద నిపుణుడు మృతి చెందాడు. పెరుంగుడి ప్రాంతానికి చెందిన 47 ఏళ్ల శివనేశన్ చెన్నైలోని సుజాతా బయోటెక్ అనే ఆయుర్వేద సంస్థలో పనిచేస్తున్నాడు. సుజాతా బయోటెక్ సంస్థ 30 ఏళ్లుగా ఆయుర్వేద వైద్య రంగంలో ఉంది. ఈ సంస్థకు ఉత్తరాఖండ్ లోని కాశీపూర్ లో ఓ ప్లాంట్ కూడా ఉంది. శివనేశన్ అక్కడే పనిచేస్తున్నాడు.

దేశవ్యాప్తంగా కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉన్న నేపథ్యంలో వైరస్ ను కట్టడి చేసే ఆయుర్వేద ఔషధం తయారీకి పూనుకున్నాడు. చెన్నై వచ్చి సంస్థ ఎండీ డాక్టర్ రాజ్ కుమార్ (67) తో కలిసి ప్రయోగాలు చేపట్టాడు. మందు తయారుచేసిన తర్వాత శివనేశన్ తో పాటు సంస్థ ఎండీ కూడా ఆ మందును తాగారు. అనంతరం వారిద్దరూ తీవ్ర అస్వస్థతకు గురికావడంతో ఆసుపత్రికి తరలించారు. శివనేశన్ చికిత్స పొందుతూ మరణించగా, ఎండీ రాజ్ కుమార్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని అధికారులు తెలిపారు.

Related posts