telugu navyamedia
ఆంధ్ర వార్తలు

నేను వైసీపీ ప్రాథమిక సభ్యుడిని, ఆ తరువాతే ఎమ్మెల్యే, శాసనసభాపతిని..

వైసీపీ ప్లీనరీ రెండో రోజు సమావేశాలు ప్రారంభం అయ్యాయి .ఈ సందర్భంగా పరిపాలనా వికేంద్రీకరణ, పారదర్శికతపై స్పీకర్ తమ్మినేని సీతారాం మాట్లాడుతూ.. రాబోయే ఎన్నికల్లో మనం విజయం సాధించడమే మన ముందున్న లక్ష్యం అని అన్నారు. 

స్పీకర్ ప్లీనరీకి వచ్చారని… రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారంటూ ఓ పేపర్లో రాశారని… గతంలో స్పీకర్ కొడెల రాలేదా అది కనపడలేదా అని ప్రశ్నించారు.ఆ రోజు ఆయన మాట్లాడింది మీరు వినలేదా? (ఆర్‌ యూ  డెఫ్‌ ఇయర్‌).. మీరు కనలేదా? (ఆర్‌ యూ బ్లైండ్‌). 

గతంలో టీడీపీ మహానాడులో ఆనాటి స్పీకర్‌ శివప్రసాద్‌ పాల్గొనలేదా?. నేను ప్లీనరీలో పాల్గొంటే తప్పా? అని ప్రశ్నించారు

నేను వైసీపీ ప్రాథమిక సభ్యుడిని, ఆ తరువాతే ఎమ్మెల్యే, శాసనసభాపతిని’’ అని తమ్మినేని సీతారాం కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ప్లీనరీ పండుగ ఘనంగా జరుగుతుంటే తాను ఇంట్లో ఎందుకు కూర్చోవాలని ప్రశ్నించారు.

గాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని సీఎం జగన్ తీసుకొచ్చారని, ఏపీలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయని అందులో తాను భాగస్వామిని కావాలనుకున్నట్లు చెప్పారు.

. రాష్ట్రంలో ఏ గడపకు వెళ్లిన సీఎం జగన్ నామస్మరణే వినిపిస్తోందన్నారు. మూడేళ్ల ప్రగతిపై సమీక్షకే ఈ ప్లీనరీ నిర్వహిస్తున్నట్టుగా చెప్పారు. ప్లీనరీకి విప్లవంలా వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు తరలివచ్చారన్నారు.

సంక్షేమ పథకాలు ఎల్లో మీడియాకు కనిపించడం లేదా అంటూ సూటిగా ప్రశ్నించారు . జగన్ నాయకత్వంలో వైసీపీ 175 స్థానాలు గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. వైఎస్ జగన్‌కు భగవంతుడు అన్ని విధాల సహకరించాలని కోరుకుంటున్నట్టుగా చెప్పారు. మరోసారి సీఎం జగన్ ముఖ్యమంత్రిగా జగన్ బాధ్యతలు చేపడతారని చెప్పారు.

జగన్ గెలవకపోతే సంక్షేమ పథకాలు ఆగిపోతాయని అన్నారు. ఈ రాష్ట్ర సంక్షేమం కోసం, ప్రగతి కోసం, అభివృద్ది కోసం కృషి చేస్తున్నారని చెప్పారు. రాష్ట్రానికి టార్చ్ బెరర్‌గా జగన్ ఉండాలని ఆకాంక్షించారు. జగన్ వెంట కలిసి నడిసేందుకు తాము అందరం సిద్దంగా ఉన్నామని చెప్పారు.

ప్రభుత్వ అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలను ప్రతి ఇంటికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. ఇకపై పార్టీ ప్రతి కార్యక్రమానికి తాను హాజరై తీరుతానని చెప్పారు. జై జగన్.. జై జై జగన్ అంటూ ప్రసంగాన్ని ముగించారు.

Related posts