నేడు తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి సభను ప్రారంభించారు. సభ ప్రారంభమైన వెంటనే పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన జవాన్లకు సంతాపం తెలుపుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.
ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ జవాన్ల కుటుంబాలకు అండగా ఉంటామని చెప్పారు. అమరులైన ఒక్కో జవాను కుటుంబానికి రూ. 25 లక్షలు ఇవ్వనున్నట్టు ప్రకటించారు. నివాళి అనంతంర జీఎస్టీ చట్టానికి తీసుకువచ్చిన సవరణ బిల్లును ప్రవేశపెట్టనున్నారు.