telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

హైకోర్టు వ్యాఖ్యలకు ప్రభుత్వం సిగ్గుపడాలి: యనమల

Yanamala tdp

 రాజధానిపై హైకోర్టు చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వానికి చెంపపెట్టు అని టీడీపీ సీనియర్ నేత, ఏపీ మాజీ మంత్రి యనమల విమర్శించారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ లాయర్లకు కనీసం టీ కప్పులు కూడా దొరకడం లేదని హైకోర్టు చేసిన వ్యాఖ్యలకు ప్రభుత్వం సిగ్గుపడాలన్నారు. రాష్ట్రంలో త్వరలో ఇసుక తుఫాన్ రాబోతుందని, దీనికి తట్టుకొని వైసీపీ సర్కార్ నిలవలేదని యనమల వ్యాఖ్యానించారు.

కేంద్ర హోంమంత్రి అమిత్ షా, సీఎం జగన్ మధ్య చర్చలు ఏమీ జరగలేదని బీజేపీ నేతలు చెబుతుంటే, 45 నిమిషాల పాటు చర్చలు జరిగాయని వైసీపీ నేతలు అబద్దాలు చెబుతున్నారన్నారు. సీఎం పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ప్రకటనల్లో డొల్లతనం ఉందని దీన్ని బట్టి తెలుస్తోందన్నారు.

Related posts