సాక్షి పత్రికలో బడ్జెట్ పై వచ్చిన వార్తల పై టీడీపీ యువ నాయకుడు నారా లోకేశ్ ట్విట్టర్ లో స్పందించారు. కేంద్ర బడ్జెట్ లో ఏపీకీ తీవ్ర అన్యాయం జరిగితే సాక్షి పత్రికలో మాత్రం కేంద్రానికి భజన చేస్తూ, వార్తలు రాసుకున్నారని లోకేశ్ దుయ్యబట్టారు. జగన్ కు ప్రజలపై విశ్వసనీయత లేదని, ఆయనకున్న విశ్వసనీయత మోదీ గురించేనని విమర్శించారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో పలు ట్వీట్లు పెట్టారు. వైఎస్ జగన్ గారూ! ఇన్నాళ్ళూ విశ్వనీయత అని మీరు అంటుంటే ప్రజల గురించి అనుకున్నాం. కానీ ఈ రోజు మీ విశ్వసనీయత మోడీ గురించి అని తెలిసింది. కేంద్ర బడ్జెట్లో ఏపీకి అన్యాయం జరిగితే పత్రిక సాక్షిలో కేంద్రానికి భజన చేస్తూ ఇలాంటి రాతలు రాసుకున్న మీ గులాంగిరికి సలాం అని అన్నారు
మెడలు వంచి ప్రత్యేక హోదా సాధిస్తామన్నారు. ఈరోజు ప్రత్యేక హోదా ఊసే లేదు. ఏది మీ పోరాటం? ఏది మీ మడమ తిప్పని నైజం? అని ప్రశ్నించారు. ఏపీ ప్రయోజనాలను సాధించడానికి మీరేం చేయదలచుకున్నారో చెప్పండి. ఇది ప్రజల తరపున మా డిమాండ్” అని, అన్నారు. “గతంలో కేంద్రం ఇలాగే ఏపీకి మొండిచెయ్యి చూపిస్తే, నైతిక బాధ్యత వహిస్తూ చంద్రబాబు రాజీనామా చేయాలని మీరు డిమాండ్ చేశారు. ఇప్పుడు మీరు ఇంకా ఎందుకు రాజీనామా చేయలేదు? అని లోకేశ్ ట్విటర్ లో ప్రశ్నించారు.
ప్రభుత్వ ప్రకటనల్లో తప్పుడు సమాచారం: లోకేశ్