కొత్త పార్టీకి రాజకీయ వ్యూహకర్త నియమించారు వైఎస్ షర్మిల. ప్రముఖ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ శిష్యురాలు ప్రియా షర్మిల పార్టీకి నియామకం అయ్యారు. అంతేకాదు.. తమిళనాడు డిఎంకె ఎమ్మెల్యే రాజేంద్రన్ కుమార్తె ఈ ప్రియ. ప్రశాంత్ కిశోర్ వద్ద శిష్యురాలుగా పనిచేసింది ప్రియా. ఈ నేపథ్యంలోనే వైఎస్ షర్మిల కొత్త పార్టీకి వ్యూహకర్తగా ప్రియా నియామకం అయ్యారు. అయితే… వైఎస్ షర్మిల ఎలా ప్రసంగించాలి, ఏ అంశాలు లేవనెత్తాలనే దానిపై ఎప్పటికప్పుడు సూచనలు చేయనుంది ప్రియా. ఇక వచ్చే నెల జూలైలో తన తండ్రి జయంతి సందర్భంగా షర్మిల పార్టీ ప్రకటన చేయనున్నారు.
previous post
ఎస్సీ వర్గీకరణపై వ్యాఖ్యలను జగన్ వెనక్కి తీసుకోవాలి: మంద కృష్ణ