telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

వైఎస్.షర్మిల కు రాజకీయ వ్యూహకర్త నియామకం

కొత్త పార్టీకి రాజకీయ వ్యూహకర్త నియమించారు వైఎస్ షర్మిల. ప్రముఖ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ శిష్యురాలు ప్రియా షర్మిల పార్టీకి నియామకం అయ్యారు. అంతేకాదు.. తమిళనాడు డిఎంకె ఎమ్మెల్యే రాజేంద్రన్ కుమార్తె ఈ ప్రియ. ప్రశాంత్ కిశోర్ వద్ద శిష్యురాలుగా పనిచేసింది ప్రియా. ఈ నేపథ్యంలోనే వైఎస్‌ షర్మిల కొత్త పార్టీకి వ్యూహకర్తగా ప్రియా నియామకం అయ్యారు. అయితే… వైఎస్‌ షర్మిల ఎలా ప్రసంగించాలి, ఏ అంశాలు లేవనెత్తాలనే దానిపై ఎప్పటికప్పుడు సూచనలు చేయనుంది ప్రియా. ఇక వచ్చే నెల జూలైలో తన తండ్రి  జయంతి సందర్భంగా షర్మిల పార్టీ ప్రకటన చేయనున్నారు.

Related posts