మిస్ వరల్డ్-2019 కిరీటం జమైకాకు చెందిన టోనీ-ఆన్ సింగ్ దక్కించుకున్నారు. లండన్లోని ఎక్సెల్ లండన్ కన్వెన్షన్ సెంటర్లో అంగరంగ వైభవంగా జరిగిన కార్యక్రమంలో ఆమెను ఈ కిరీటం వరించింది. గత ఏడాది మిస్ వరల్డ్గా నిలిచిన మెక్సికో సుందరి వనెస్సా పొన్స్.. టోనీ-ఆన్ సింగ్ తలపై మిస్ వరల్డ్ కిరీటాన్ని అలంకరించారు. ఈ పోటీలో ఫస్ట్ రన్నరప్గా ఫ్రాన్స్కు చెందిన ఒఫ్లి మెజినో, సెకండ్ రన్నరప్గా భారత్కు చెందిన సుమన్ రావ్ నిలిచారు.
నవంబర్ 20వ తేదీ నుంచి మొదలైన 69వ మిస్ వరల్డ్-2019 పోటీలో 120 దేశాలకు చెందిన అందగత్తెలు పాల్గొన్నారు. పలు వడబోతల అనంతరం ఫైనల్స్ కోసం 10 మందిని ఎంపిక చేశారు. అంతిమంగా ఎంపికైన ఐదుగురికి ప్రముఖ వ్యాఖ్యాత పియర్స్ మోర్గాన్ నేతృత్వంలోని బృందం పలు ప్రశ్నలు సంధించింది. అందగత్తెల సమాధానాల ఆధారంగా విజేతలను ఎంపిక చేసింది. తన సొంతూరుతోపాటు ప్రపంచవ్యాప్తంగా లింగ సమానత్వం కోసం పోరాడతానని ఈ సందర్భంగా భారత్కు చెందిన రన్నరప్ సుమన్ రావ్ అన్నారు. జమైకా నుంచి మిస్ వరల్డ్ గెలుచుకున్న నాలుగో మహిళగా టోనీ-ఆన్ చరిత్ర సృష్టించారు. తొమ్మిదేళ్ల వయస్సులో ఆమె కుటుంబం అమెరికాకు వలస వెళ్లి, ఫ్లోరిడాలో స్థిరపడింది.