తెలంగాణ ఆర్టీసీ సమ్మెపై దాఖలైన పిటిషన్పై హైకోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా ఆర్టీసీ ఆర్థిక స్థితిపై ప్రభుత్వం కోర్టుకు నివేదిక సమర్పించింది. అయితే న్యాయస్థానం మాత్రం ప్రభుత్వ తీరుపై పలు ప్రశ్నలు సంధించింది. ఆర్టీసీ ఎండీ నియామకం ఇప్పటివరకు ఎందుకు చేపట్టలేదని హైకోర్టు తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.
ప్రస్తుతం ఆర్టీసీ ఇంచార్జ్గా సీనియర్ అధికారి ఉన్నారని ప్రభుత్వం తెలుపడంపై కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇప్పుడున్న అధికారి సమర్థుడైతే ఎండీగా ఎందుకు నియమించలేదని ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించింది. ఎండీ నియామకం చేపట్టి ఉంటే కార్మికులకు నమ్మకం కలిగి ఉండేదని న్యాయస్థానం అభిప్రాయపడింది.