telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఆర్టీసీని తెచ్చి నెత్తిమీద పెట్టుకోవడం అదనపు భారమే: జేసీ

jc-diwakar-reddy

ఏపీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వంద రోజుల పాలన పై వైసీపీ నేతలు జగన్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తుంటే మరోవైపు టీడీపీ నేతలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్‌ను చేయిపట్టి నడిపించేవాడు కావాలని జేసీ చెప్పారు. ప్రతి అంశాన్ని మైక్రోస్కోపులో చూసి లోపాలను సరిదిద్దాలి.. అంతేగాని దాన్ని నేలకేసి కొట్టొద్దని జేసీ వ్యాఖ్యానించారు.

కొత్తగా ఉద్యోగాలు సృష్టించలేదు కానీ, ఆర్టీసీని తెచ్చి నెత్తిమీద పెట్టుకోవడం అదనపు భారమేనని జేసీ జోస్యం చెప్పారు. అంతటితో ఆగని ఆయన మా వాడు చాలా తెలివైనవాడు అంటూ వైఎస్ జగన్‌కు జేసీ కితాబిచ్చారు. రాజధాని అమరావతిలోనే ఇక్కడే ఉంటుందని, ఎక్కడికీ తరలిపోదని మాజీ ఎంపీ జేసీ చెప్పుకొచ్చారు.

Related posts