అసెంబ్లీ ఆవరణలో నిన్న మార్షల్స్ తో వాగ్యుద్ధం సందర్భంగా చంద్రబాబు ఓ ఉద్యోగిని ‘బాస్టర్డ్’ అన్నారంటూ వైసీపీ సభ్యులు సభలో ఆరోపించడం తెలిసిందే. ఈ విషయం పై టీడీపీ అధినేత చంద్రబాబు నిప్పులు చెరిగారు. తాను అనని పదాన్ని సభలో సృష్టించారంటూ మండిపడ్డారు. తాను అన్నది మరొకటైతే, దాన్ని వక్రీకరించారని తెలిపారు. ప్రతిపక్ష సభ్యులను అసెంబ్లీకి రాకుండా అడ్డుకొని, అప్రజాస్వామిక చర్యలకు పాల్పడింది వైసీపీ వాళ్లేనని అన్నారు.
ఎంత ఆవేశంలోనైనా వైసీపీ వాళ్ల లాగా సంస్కారహీనమైన భాష ఉపయోగించడం తనకు రాదని చంద్రబాబు స్పష్టం చేశారు. తనపై ఇలాంటి కుట్రలు, ఆరోపణలు చేస్తే వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. ఆర్నెల్ల పాలనలో వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే ఈ కుట్రలని ఆరోపించారు. ఈ కుట్రలను ప్రజలే తిప్పికొడతారని ట్విట్టర్ లో పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వ అసమర్ధత వల్లే ఇసుక సమస్య: కన్నా