ప్రకాశం జిల్లా కురిచేడులో మద్యంకు బదులు శానిటైజర్లు తాగి 9 మంది మరణించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మరణాలపై ప్రభుత్వం సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తగిన సాయం అందించాలని విజ్ఞప్తి చేశారు.
మద్యం నిషేధిస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం రాష్ట్రంలో నాటుసారా ఏరులై పారుతున్నా పట్టించుకోవడంలేదని ఆరోపించారు. మద్యానికి బానిసలైన వాళ్లు ప్రాణాలు కోల్పోతున్నారని తెలిపారు. నాటు సారాను అరికట్టడంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని సూచించారు.మద్యం దుకాణాలను తెరిచి ఉంచే సమయం మరో గంట సేపు పొడిగించడం చూస్తుంటే ప్రభుత్వానికి మద్యనిషేధంపై చిత్తశుద్ధి లేదన్న విషయం అర్థమవుతోందని విమర్శించారు.
తెలుగు రాష్ట్రాల ప్రజలు మాట్లాడుకోలేని పరిస్థితి: చంద్రబాబు