అధికార బీజేపీ కి దేశవ్యాప్తంగా ఉన్న వ్యతిరేకత ఆ పార్టీ నేతలలో గెలుపుపై అనుమానాలు కలిగిస్తున్నాయి. దీనితో వారు పార్టీ మారే యోచనలు చేస్తున్నారు. తాజాగా, ఈ నెల 21న విజయవాడలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ సమక్షంలో ఆ పార్టీలో చేరతా. అంతకు ముందే ఎమ్మెల్యే పదవికి, బీజేపీకి రాజీనామా చేస్తా. రాజీనామా పత్రాన్ని స్పీకర్ ఫార్మెట్లో పంపిస్తాను’’ అని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ చెప్పారు.
ఆయనను పార్టీలోకి ఆహ్వానిస్తూ శుక్రవారం రాజమహేంద్రవరంలో జనసేన నాయకులు, కార్యకర్తలు ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘‘ఇప్పటికే పవన్ కల్యాణ్తో భేటీ అయ్యాను. 21వ తేదీ ఉదయం 11 గంటలకు విజయవాడలో ఆయన సమక్షంలో సహచరి లక్ష్మీపద్మావతితో కలిసి పార్టీ తీర్థం తీసుకుంటానని, నేను బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ నా భార్య ఐదేళ్లుగా జనసేనలోనే ఉన్నారు’’ అని ఆకుల తెలిపారు.